శ్రీ తిరిపుర సుందరి సమేత శ్రీ వేదగిరిస్వరార్ ఆలయం, కుమిఝి
జన్మ, పునర్జన్మల సముద్రంలో జీవించటానికి మరియు మనగలగటానికి పోరాటం చేసే లక్షలాది భక్తుల కోసం ఆ పరమేశ్వరుడు మానవాళిపై తన స్వాభావికమైన దయ మరియు ప్రేమలతో ఈ భూమిపై ఉన్న అసంఖ్యాకమైన ఆలయాల్లో వివిధ రూపాల్లో మన ప్రపంచంలో వెలిసారు. అటువంటి ఆలయాల్లో ఒకటైన కుంఝిలోని 1200 సంవత్సరాల నాటికి చెందిన శ్రీ వేదగిరిస్వరూర్ ఆలయం వైద్యపరమైన విలువలున్న వనమూలికలతో నిండిన మూడు పర్వతాల మధ్యలో ఉంది. ఈ ఆలయం ట్యాంకుకి కూడా వైద్యపరమైన గుణాలు ఉండటంతో దాని నీటితో స్నానం చేసి దాని మట్టిని శరీరానికి రాసుకోవటం వల్ల ఎన్నో వ్యాధులు తగ్గుతాయి. విశ్వ విరూక్ష శివ లింగంపైన గొడుగు రూపంలో వ్యాపించి ఉండటం ఈ ఆల యానికి ఉన్న మరొక ప్రత్యేకత. ఇటుంటి దృశ్యం ఇతర శివాలయాల్లో మరెక్కడా కనిపించదు.
స్థల పురాణం
కుమిఝిలో శ్రీ వేదగిరి స్వరార్ ఆలయం నెల్లికుప్పం వైపుగా తూర్పుకి ఉండే రోడ్డు మీద గుడువంచెరి నుంచి 9 కిమీ దూరంలో ఉంది. అందమైన మరియు శాంతియుతమైన దట్టమైన అడవి మధ్యలో శ్రీ తిరిపుర సుందరి సమేత శ్రీ వేదగిరిస్వరార్ తమ దైవిక ఉనికితో ఈ ఆలయంలో కొలువయ్యారు.
దట్టమైన అడవి మధ్యలో, చుట్టూరా మూడు పర్వతాలతో,
శ్రీ వేదగిరిస్వరార్ నిల్చున్నారు -
ఆయన భక్తులు గుడువెంచెరి కుమిఝి కరుణా కటాక్షాలచే
తమ జీవితాలు నిండి ఉండటాన్ని గుర్తించారు.
దాదాపు 900 సంవత్సరాల కిందట, శ్రీ వేదగిరిస్వరార్ ఆలయం పల్లవ వంశానికి చెందిన రాజు కుమిఝిలో ఆలయాన్ని, దాని ప్రాంగణంలో శివ లింగాన్ని నిర్మించారు. కాలక్రమేణ, వివిధ రకాల తీగెలు, మొక్కలతో ఆలయం నిండిపోయి, శిథిలావస్థలోకి వచ్చినట్లుగా కనిపించి, ఆ ప్రాంతానికి చెందిన ప్రజలకి కనిపించకుండా పోయింది.
ఈ గ్రామంలో నివసించే బ్రాహ్మణుడు ఒకరు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ, తన ఇంటిని వదిలి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాడు. తను మరణించే లోపల తన ముగ్గురు కుమార్తెలకి వివాహం చేయలేకపోవటం గురించి ఎంతో విచారించేవాడు. అదే గ్రామం నుంచి ప్రయాణించిన ఒక ప్రయాణికుడు, శివ భక్తుడు బ్రాహ్మణుడి దయనీయమైన పరిస్థితిని చూసాడు. సమీపంలోని అడవి మధ్యలో దాగున్న శ్రీ వేదగిరిస్వరార్ ఆలయం గురించి అతడికి తెలియచేసాడు. ఆలయంలో శ్రీ వేదగిరిస్వరార్ ని ప్రార్థించి, ఆలయంలోని օసరోని తడాగంֆ చెరువులో స్నానం చేసి, శరీరంపై చెరువులోని మట్టి రాసుకోవల్సిందిగా అతడికి చెప్పాడు. బ్రాహ్మణుడు అతడు చెప్పినట్లే చేసాడు, కొద్ది వారాల్లోనే ఒక అద్భుతం జరిగింది. బ్రాహ్మణుడు బాధపడుతున్న తీవ్రమైన వ్యాధి మచ్చుకైనా కనిపించకుండా మాయమైంది, ఆయన ఆరోగ్యంతో ప్రకాశించటం ప్రారంభించాడు. త్వరలోనే ఆయన ముగ్గురు కుమార్తెల వివాహాలు కూడా జరిగిపోయాయి. వారి పట్ల తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలు పూర్తైనందుకు బ్రాహ్మణుడు సంతోషించాడు. ఆయన శ్రీ వేదగిరిస్వరార్ ఆలయాన్ని స్తుతిస్తూ గానం చేయటం ఆరంభించటంతో ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు సరోని తడాగానికి ఉన్న ఆశ్చర్యకరమైన వ్యాధుల్ని నయం చేసే శక్తి గురించి తెలుసుకుని, తమ శరీరాలపై దాని మట్టి రాసుకోవటానికి తండోపతండాలుగా అక్కడకి వెళ్లి తమ వ్యాధుల్ని నయం చేసుకున్నారు.
మట్టి కూడా ఒక ఔషధంగా మారింది, నీరు ఒక నైవేద్యంగా మారింది,
కేవలం శ్రీ వేదగిరిస్వరార్ ని ప్రార్థించటం ద్వారా
మచ్చుకైనా లేకుండా తీవ్రమైన అనారోగ్యాలు మాయమయ్యాయి.
అన్ని రకాల తీగెలు, మొక్కలతో నిండిపోయి, దట్టమైన అడవిలో కనిపించకుండా పోయిన శ్రీ వేదగిరిస్వరార్ ఆలయం శ్రీ వాసు కలలో కనిపించింది. పరమేశ్వరుడి దయతో, చెప్పుకోతగ్గ తన సొంత ఖర్చుతోనే ఆలయాన్ని మరమ్మతు చేయించటానికి కష్టపడ్డాడు , దాని గత వైభవాన్ని విజయవంతంగా తీసుకువచ్చాడు. ఇప్పుడు కుమిఝిలోని శ్రీ వేదగిరిస్వరార్ ఆలయం చూసేవారికి సంభ్రమాన్ని కలిగిస్తుంది, చుట్టుపక్కల, దూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఎంతగానో దాన్ని సందర్శిస్తారు. ఆలయంలోని తటాకం చల్లటి నీటితో నిండి ఉండి తీవ్రమైన ఎండా కాలంలో సైతం ఎండిపోదు. తటాకంలోని తియ్యటి నీరు, అడవిలో అందమైన, సహజమైన పరిసరాలు, శాంతియుతమైన పరిసరాలతో భక్తుల హృదయాల్లో భక్తిపరమైన ఆలోచనల్ని నింపుతున్నాయి, ఆలయం చుట్టూ ఉన్న మూడు పర్వతాల దృశ్యం , అన్ని సమయాల్లో చల్లటి ఔషధపరమైన గాలి వీస్తూ, భక్తుల దాహాన్ని తీర్చే అంతులేని నీటి చెలమ, గర్భగుడిలో శివలింగం రూపంలో శ్రీ వేదగిరిస్వరార్ విగ్రహం, దాని పక్కన శ్రీ తిరిపుర సుందరి ఆలయం, విల్వ మారం, వన్ని మారం వంటి చల్లటి నీడనిచ్చే చెట్లు, కుమ్ఝిలోని ఈ ఆలయం శివ భక్తులు ఎవరైనా సరే తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా చూసి తీరాల్సిన పుణ్యక్షేత్రం. మంగళవారం, శుక్రవారాలు ప్రత్యేక పూజలు ఉంటాయి, నెలలో ప్రతీ పౌర్ణిమ రోజున గిరి వాలం జరుగుతుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వాలంపురి వినయగర్ తన వైభవంతో 18 అడుగుల విగ్రహం ఉంటుంది.
ఆయన చుట్టూరా, నాలుగు వైపులా భక్తులు పూజించటానికి వలంపురి , ఇదంపురి , పంచముఖ గణపతి విగ్రహాలు ఉంటాయి. నవ్వుతున్న ఆంజనేయుడి బంగారం విగ్రహం, శ్రీదేవి, భూదేవి, శ్రీనివాసుడు, పెరుమాళ్, గరుడ ఆల్వార్ , దత్తాత్రేయార్ , కాల భైరవుడు, నవగ్రహాలు , చంద్రుడు, గురుడు, సూర్యుడు ప్రతీ ఒక్కరికి వేరుగా కేటాయించిన పీఠంలో కరుణా కటాక్షాలతో కనిపిస్తున్నారు. శ్రీలక్ష్మి మరియు శ్రీ సరస్వతి పీఠాలతోపాటు కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి మరియు మహాకాళిల వేర్వేరు పీఠాలు ఉన్నాయి. అతి మారం, వెప్ప మారం అనే చెట్ల నీడ కింద, పాములు నివసించే చెదల పుట్ట ఉంది, పాలవతమామ్, అష్టదుర్గ, లక్ష్మి గణపతి, వల్లి, దేవయాని భార్యలతో సుబ్రమణియార్ ల పీఠాలు, మరియు సబరిమల సస్తా ఉన్నాయి. ఈ ఆలయంలో దేవతా, దేముళ్లకు పీఠాలు ఉండటమే కాకుండా , తీవరం పాడే నాల్వార్, 18 సితార్లు, 7 సప్త కన్నిస్ల కోసం కూడా వేర్వేరుగా పీఠాలు ఉన్నాయి. అతిమారం, అరసమారం, వెప్పమారం, విల్వమారం, వన్నిమారం వంటి ఎన్నో చెట్ల జాతులు ఈ ఆలయం నేల మీద చెల్లాచెదురుగా ఉండి భక్తులు నడిచే నేల మీదకి ఎన్నడూ ఎండ చేరకుండా ఎంతో చల్లదనాన్ని ఇస్తున్నాయి. భక్తులు అందరూ ప్రార్థించే దేముళ్లందరూ ఈ ఒక్క ఆలయంలో ఉండటం ఎంతో అద్భుతం. దీనివల్ల వాళ్లందర్నీ ఒకే సమయంలో ఇక్కడ ప్రార్థించటానికి వీలవుతుంది. ఔషధ గుణాలు కల వనమూలికల తియ్యటి పరిమళం, అడవి నుంచి వచ్చే చల్లటి గాలి , లేళ్లు, నెమళ్లు , మైనా , కోయల, కొంగలు, బాతులు వంటి అడవి జంతువులు, పక్షులు భక్తుల కళ్లకు తరచు కనిపిస్తాయి. ఈరోజుకీ సితార్లు సందర్శించే ఈ ఆలయానికి అవన్నీ సాక్ష్యాలుగా ఉన్నాయి. వివాహాలు చేయటంలో సమస్యలు, సంతానం కలగకపోవటం , మనస్శాంతి కావాలనుకోవటం, ప్రతీ ప్రయత్నంలో విజయానికి , తీవ్రమైన అనారోగ్యానికి ముగింపు చెప్పటానికి కుమ్ఝిలోని శ్రీ వేదగిరిస్వరార్ ఆలయం దూరపు, దగ్గరలో ఉన్న భక్తులకు కూడా దేవుడు పంపించినది.
దట్టమైన అడవి మధ్యలో, చుట్టూరా మూడు పర్వతాలతో,
శ్రీ వేదగిరిస్వరార్ నిల్చున్నారు -
ఆయన భక్తులు గుడువెంచెరి కుమిఝి కరుణా కటాక్షాలచే
తమ జీవితాలు నిండి ఉండటాన్ని గుర్తించారు.
దాదాపు 900 సంవత్సరాల కిందట, శ్రీ వేదగిరిస్వరార్ ఆలయం పల్లవ వంశానికి చెందిన రాజు కుమిఝిలో ఆలయాన్ని, దాని ప్రాంగణంలో శివ లింగాన్ని నిర్మించారు. కాలక్రమేణ, వివిధ రకాల తీగెలు, మొక్కలతో ఆలయం నిండిపోయి, శిథిలావస్థలోకి వచ్చినట్లుగా కనిపించి, ఆ ప్రాంతానికి చెందిన ప్రజలకి కనిపించకుండా పోయింది.
ఈ గ్రామంలో నివసించే బ్రాహ్మణుడు ఒకరు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ, తన ఇంటిని వదిలి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాడు. తను మరణించే లోపల తన ముగ్గురు కుమార్తెలకి వివాహం చేయలేకపోవటం గురించి ఎంతో విచారించేవాడు. అదే గ్రామం నుంచి ప్రయాణించిన ఒక ప్రయాణికుడు, శివ భక్తుడు బ్రాహ్మణుడి దయనీయమైన పరిస్థితిని చూసాడు. సమీపంలోని అడవి మధ్యలో దాగున్న శ్రీ వేదగిరిస్వరార్ ఆలయం గురించి అతడికి తెలియచేసాడు. ఆలయంలో శ్రీ వేదగిరిస్వరార్ ని ప్రార్థించి, ఆలయంలోని օసరోని తడాగంֆ చెరువులో స్నానం చేసి, శరీరంపై చెరువులోని మట్టి రాసుకోవల్సిందిగా అతడికి చెప్పాడు. బ్రాహ్మణుడు అతడు చెప్పినట్లే చేసాడు, కొద్ది వారాల్లోనే ఒక అద్భుతం జరిగింది. బ్రాహ్మణుడు బాధపడుతున్న తీవ్రమైన వ్యాధి మచ్చుకైనా కనిపించకుండా మాయమైంది, ఆయన ఆరోగ్యంతో ప్రకాశించటం ప్రారంభించాడు. త్వరలోనే ఆయన ముగ్గురు కుమార్తెల వివాహాలు కూడా జరిగిపోయాయి. వారి పట్ల తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలు పూర్తైనందుకు బ్రాహ్మణుడు సంతోషించాడు. ఆయన శ్రీ వేదగిరిస్వరార్ ఆలయాన్ని స్తుతిస్తూ గానం చేయటం ఆరంభించటంతో ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు సరోని తడాగానికి ఉన్న ఆశ్చర్యకరమైన వ్యాధుల్ని నయం చేసే శక్తి గురించి తెలుసుకుని, తమ శరీరాలపై దాని మట్టి రాసుకోవటానికి తండోపతండాలుగా అక్కడకి వెళ్లి తమ వ్యాధుల్ని నయం చేసుకున్నారు.
మట్టి కూడా ఒక ఔషధంగా మారింది, నీరు ఒక నైవేద్యంగా మారింది,
కేవలం శ్రీ వేదగిరిస్వరార్ ని ప్రార్థించటం ద్వారా
మచ్చుకైనా లేకుండా తీవ్రమైన అనారోగ్యాలు మాయమయ్యాయి.
అన్ని రకాల తీగెలు, మొక్కలతో నిండిపోయి, దట్టమైన అడవిలో కనిపించకుండా పోయిన శ్రీ వేదగిరిస్వరార్ ఆలయం శ్రీ వాసు కలలో కనిపించింది. పరమేశ్వరుడి దయతో, చెప్పుకోతగ్గ తన సొంత ఖర్చుతోనే ఆలయాన్ని మరమ్మతు చేయించటానికి కష్టపడ్డాడు , దాని గత వైభవాన్ని విజయవంతంగా తీసుకువచ్చాడు. ఇప్పుడు కుమిఝిలోని శ్రీ వేదగిరిస్వరార్ ఆలయం చూసేవారికి సంభ్రమాన్ని కలిగిస్తుంది, చుట్టుపక్కల, దూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఎంతగానో దాన్ని సందర్శిస్తారు. ఆలయంలోని తటాకం చల్లటి నీటితో నిండి ఉండి తీవ్రమైన ఎండా కాలంలో సైతం ఎండిపోదు. తటాకంలోని తియ్యటి నీరు, అడవిలో అందమైన, సహజమైన పరిసరాలు, శాంతియుతమైన పరిసరాలతో భక్తుల హృదయాల్లో భక్తిపరమైన ఆలోచనల్ని నింపుతున్నాయి, ఆలయం చుట్టూ ఉన్న మూడు పర్వతాల దృశ్యం , అన్ని సమయాల్లో చల్లటి ఔషధపరమైన గాలి వీస్తూ, భక్తుల దాహాన్ని తీర్చే అంతులేని నీటి చెలమ, గర్భగుడిలో శివలింగం రూపంలో శ్రీ వేదగిరిస్వరార్ విగ్రహం, దాని పక్కన శ్రీ తిరిపుర సుందరి ఆలయం, విల్వ మారం, వన్ని మారం వంటి చల్లటి నీడనిచ్చే చెట్లు, కుమ్ఝిలోని ఈ ఆలయం శివ భక్తులు ఎవరైనా సరే తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా చూసి తీరాల్సిన పుణ్యక్షేత్రం. మంగళవారం, శుక్రవారాలు ప్రత్యేక పూజలు ఉంటాయి, నెలలో ప్రతీ పౌర్ణిమ రోజున గిరి వాలం జరుగుతుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వాలంపురి వినయగర్ తన వైభవంతో 18 అడుగుల విగ్రహం ఉంటుంది.
ఆయన చుట్టూరా, నాలుగు వైపులా భక్తులు పూజించటానికి వలంపురి , ఇదంపురి , పంచముఖ గణపతి విగ్రహాలు ఉంటాయి. నవ్వుతున్న ఆంజనేయుడి బంగారం విగ్రహం, శ్రీదేవి, భూదేవి, శ్రీనివాసుడు, పెరుమాళ్, గరుడ ఆల్వార్ , దత్తాత్రేయార్ , కాల భైరవుడు, నవగ్రహాలు , చంద్రుడు, గురుడు, సూర్యుడు ప్రతీ ఒక్కరికి వేరుగా కేటాయించిన పీఠంలో కరుణా కటాక్షాలతో కనిపిస్తున్నారు. శ్రీలక్ష్మి మరియు శ్రీ సరస్వతి పీఠాలతోపాటు కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి మరియు మహాకాళిల వేర్వేరు పీఠాలు ఉన్నాయి. అతి మారం, వెప్ప మారం అనే చెట్ల నీడ కింద, పాములు నివసించే చెదల పుట్ట ఉంది, పాలవతమామ్, అష్టదుర్గ, లక్ష్మి గణపతి, వల్లి, దేవయాని భార్యలతో సుబ్రమణియార్ ల పీఠాలు, మరియు సబరిమల సస్తా ఉన్నాయి. ఈ ఆలయంలో దేవతా, దేముళ్లకు పీఠాలు ఉండటమే కాకుండా , తీవరం పాడే నాల్వార్, 18 సితార్లు, 7 సప్త కన్నిస్ల కోసం కూడా వేర్వేరుగా పీఠాలు ఉన్నాయి. అతిమారం, అరసమారం, వెప్పమారం, విల్వమారం, వన్నిమారం వంటి ఎన్నో చెట్ల జాతులు ఈ ఆలయం నేల మీద చెల్లాచెదురుగా ఉండి భక్తులు నడిచే నేల మీదకి ఎన్నడూ ఎండ చేరకుండా ఎంతో చల్లదనాన్ని ఇస్తున్నాయి. భక్తులు అందరూ ప్రార్థించే దేముళ్లందరూ ఈ ఒక్క ఆలయంలో ఉండటం ఎంతో అద్భుతం. దీనివల్ల వాళ్లందర్నీ ఒకే సమయంలో ఇక్కడ ప్రార్థించటానికి వీలవుతుంది. ఔషధ గుణాలు కల వనమూలికల తియ్యటి పరిమళం, అడవి నుంచి వచ్చే చల్లటి గాలి , లేళ్లు, నెమళ్లు , మైనా , కోయల, కొంగలు, బాతులు వంటి అడవి జంతువులు, పక్షులు భక్తుల కళ్లకు తరచు కనిపిస్తాయి. ఈరోజుకీ సితార్లు సందర్శించే ఈ ఆలయానికి అవన్నీ సాక్ష్యాలుగా ఉన్నాయి. వివాహాలు చేయటంలో సమస్యలు, సంతానం కలగకపోవటం , మనస్శాంతి కావాలనుకోవటం, ప్రతీ ప్రయత్నంలో విజయానికి , తీవ్రమైన అనారోగ్యానికి ముగింపు చెప్పటానికి కుమ్ఝిలోని శ్రీ వేదగిరిస్వరార్ ఆలయం దూరపు, దగ్గరలో ఉన్న భక్తులకు కూడా దేవుడు పంపించినది.
మహాకుంభాభిషేకం, 01-06-2012
ఈ ఆలయం పునరుద్ధరణ పూర్తయిన తర్వాత, కుడముజుక్కు నన్నేరాట్టు విఝ (మహా కుంభాభిషేకం) శ్రీ నందన సంవత్సరంలో, వైశాఖ మాసంలో, 19వ రోజు, శుక్ల పక్షం, ద్వాదశి తిథి, సితిరాయ్ నక్షత్రం , సీత యోగం, మిధున లగ్నంలో జరిగింది. (లేదా ఇంగ్లిషు క్యాలెండరులో 2012 జూన్ 1న శుక్రవారం)
శ్రీ తిరిపుర సుందరి సమేత శ్రీ వేదగిరిస్వరార్, శ్రీ లక్ష్మీ గణపతి , వల్లీ, దేవయాని భార్యలతో శ్రీ సుబ్రమణియార్, శ్రీ సందికేశ్వరార్, శ్రీ నందికేశ్వరార్, శ్రీ కాలభైరవ, శ్రీ నవగ్రహ మూర్తులు, శ్రీ చంద్రన్, శ్రీ గురు భగవాన్, శ్రీ సూర్యన్, శ్రీ విష్ణు దుర్గ, సమయ గురువార్ నాల్వార్, శ్రీ అయ్యప్పన్, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాస పెరుమాళ్, శ్రీ గరుడ ఆల్వార్, శ్రీ ఆంజనేయార్, ఆలయంలో ఉన్న ఇతర భక్తులందరికి.
మహాకుంభాభిషేకం కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. మఠం శిష్యులు, పూర్వీకులు, పెద్దలు, కుమ్ఝి గ్రామ ప్రజలు , దగ్గరలో, దూరంగా ఉన్న భక్తులు మహాకుంభాభిషేకానికి హాజరై తమ జీవితాలు సుఖసంతోషాలతో నిండటానికి పార్వతీపరమేశ్వరుల ఆశీర్వచనాల్ని అందుకున్నారు.
శ్రీ తిరిపుర సుందరి సమేత శ్రీ వేదగిరిస్వరార్, శ్రీ లక్ష్మీ గణపతి , వల్లీ, దేవయాని భార్యలతో శ్రీ సుబ్రమణియార్, శ్రీ సందికేశ్వరార్, శ్రీ నందికేశ్వరార్, శ్రీ కాలభైరవ, శ్రీ నవగ్రహ మూర్తులు, శ్రీ చంద్రన్, శ్రీ గురు భగవాన్, శ్రీ సూర్యన్, శ్రీ విష్ణు దుర్గ, సమయ గురువార్ నాల్వార్, శ్రీ అయ్యప్పన్, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాస పెరుమాళ్, శ్రీ గరుడ ఆల్వార్, శ్రీ ఆంజనేయార్, ఆలయంలో ఉన్న ఇతర భక్తులందరికి.
మహాకుంభాభిషేకం కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. మఠం శిష్యులు, పూర్వీకులు, పెద్దలు, కుమ్ఝి గ్రామ ప్రజలు , దగ్గరలో, దూరంగా ఉన్న భక్తులు మహాకుంభాభిషేకానికి హాజరై తమ జీవితాలు సుఖసంతోషాలతో నిండటానికి పార్వతీపరమేశ్వరుల ఆశీర్వచనాల్ని అందుకున్నారు.